మణిపూర్‌ లో మళ్లీ హింస.. 9 మంది మృతి !

by Dishafeatures2 |
మణిపూర్‌ లో మళ్లీ హింస.. 9 మంది మృతి !
X

ఇంఫాల్‌ : మణిపూర్‌ మంటలు ఆరడం లేదు. హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇంకో 15 మంది గాయపడగా.. దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఈనేపథ్యంలో కర్ఫ్యూ అమలుచేస్తున్న సమయాన్ని మరింత పెంచారు. ఆంక్షలను మరింత కఠినతరం చేశారు.

Next Story

Most Viewed