ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపిన తల్లి.. ఆ తర్వాత తానూ

by Gantepaka Srikanth |

మేడ్చల్(Medchal) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపిన తల్లి.. ఆ తర్వాత తానూ
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్(Medchal) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల(Two Children)ను అతి కిరాతకంగా కొడవళ్లతో నరికి చంపింది. ఆ తర్వాత తానూ ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య(Mother Suicide) చేసుకున్నది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఆర్థిక కారణాలు కుటుంబాలను కబళిస్తున్నాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోయేలా చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తగ్గడం లేదు.

Next Story