- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ కొత్త సుప్రీంలీడర్గా ఖమేనీ కుమారుడు!
అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మోజ్తాబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నికైనట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్-అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మోజ్తాబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా అధికారికంగా వెల్లడించింది. మోజ్తాబా ఖమేనీను ఎన్నుకోవాలని ఆ దేశ మత పెద్దలను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతని ఎన్నిక అనివార్యం అయినట్లు చెబుతున్నారు.
ఖమేనీ ప్రతి కార్యకలాపాలలో కీలక పాత్ర మోజ్తాబా పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) , మోజ్తాబా ఖమేనీకు మధ్య చాలా రోజుల నుంచి క్లోజ్ రిలేషన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మోజ్తాబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మోజ్తాబా ఖమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్ - అమెరికా స్పందించాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా అయతుల్లా అలీ ఖమేనీ రెండు రోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయంపై దాదాపు 30 బాంబులు ఇజ్రాయెల్ వేసింది. ఈ తరుణంలోనే ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది మరణించారు.






