గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా పేలిన మొబైల్ ఫోన్.. బాలిక మృతి

by Disha Web Desk 6 |
గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా పేలిన మొబైల్ ఫోన్.. బాలిక మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చిన్నా పెద్ద మొబైల్ ఫోన్లకు బానిసలయ్యారు. ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతూ ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. ఫోన్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

తాజాగా, కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరువిల్వామలలో ఆదిత్యశ్రీ అనే చిన్నారి మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. దీంతో బాలిక మృతి చెందింది. గట్టిగా శబ్దం రావడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా అప్పటికే బాలిక మరణించింది. తమ నిర్లక్ష్యం వల్లే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయిందని చిన్నారి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఎక్కువ సేపు గేమ్ ఆడటం వల్ల పేలిందని భావిస్తున్నారు.

Next Story

Most Viewed