అనుమానస్పద స్థితిలో యువతి అదృశ్యం..

by Disha Web Desk 11 |
అనుమానస్పద స్థితిలో యువతి అదృశ్యం..
X

దిశ, బడంగ్​పేట్​: బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చే సరికి చిన్న కూతురు అనుమానస్పద స్థితిలో అదృశ్యమయిన ఘటన పహాడిషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. పహాడిషరీఫ్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్​ మండలం జల్​పల్లి విలేజ్​ వాదియే ముస్తఫాకు చెందిన రజియాబేగం, దివంగత మంజూర్ హుస్సేన్​ లు దంపతులు. వీరికి హీనా బేగం(22), ఇలియాజ్​ హుస్సేన్​లు సంతానం. ఇంటర్మీడియెట్ వరకు చదివిన హీనా బేగం ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది.

ఈ నెల 30వ తేదీన రాత్రి 11గంటలకు రజియాబేగం చిన్న కుమారుడు ఇలియాజ్​ హుస్సేన్​తో కలిసి బండ్లగూడలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న హీనా బేగం కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ కోసం చుట్టు పక్కల బంధువుల ఇండ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో తల్లి రజియా బేగం పహాడిషరీప్​ పోలీస్​స్టేషన్​ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed