జిల్లాలో భారీ చోరీ.. భోజనం చేసి వచ్చేలోపు మాయమైన డబ్బుల బ్యాగు

by Gantepaka Srikanth |

జిల్లాలో భారీ చోరీ.. భోజనం చేసి వచ్చేలోపు మాయమైన డబ్బుల బ్యాగు

జిల్లాలో భారీ చోరీ.. భోజనం చేసి వచ్చేలోపు మాయమైన డబ్బుల బ్యాగు
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్(Nirmal) జిల్లాలో భారీ చోరీ(theft) జరిగింది. సోమవారం సాయంత్రం భైంసా పట్టణంలోని ఓ ఏటీఎం సెంటర్‌లో యువకుడు రూ.5 లక్షల నగదు డ్రా చేశాడు. ఆ డబ్బును బ్యాగులో పెట్టి స్కూటీకి తగిలించాడు. అనంతరం ఓ రెస్టారెంట్‌లో భోజనానికి వెళ్లాడు. భోజనం చేసి బయటకు వచ్చి చూస్తే స్కూటీకి తగిలించిన బ్యాగు మాయం అయింది. దీంతో వెంటనే ముథోల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. రెస్టారెంట్ సమీపంలోని సీసీ టీవీలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story