- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య..
by Batti.Sumithra |
మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన త్రివేణి (25) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోనికి వచ్చింది.

X
దిశ , మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన త్రివేణి (25) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోనికి వచ్చింది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణతో త్రివేణికి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భర్త లక్ష్యనారాయణతో కలిసి మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామంలోని తల్లి వద్దకు వచ్చినట్లు సమాచారం. రాత్రి తల్లి నిద్రలో ఉండగా తెల్లవారుజామున త్రివేణి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతురాలి తల్లి కృష్ణవేణి తెలిపారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు.
Next Story






