గోపాల్‌పేటలో వివాహిత అదృశ్యం..

by Kema Shiva Kumar |

ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకున్నది.

గోపాల్‌పేటలో వివాహిత అదృశ్యం..
X

దిశ, గోపాల్‌పేట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన దయ్యం మసమ్మ(60) ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. అయితు కుటుంబ సభ్యులు గ్రామంలో, చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆమె ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం గోపాల్‌పేట పోలీస్ స్టేషన్ ఆమె కుమారుడు రాజు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story