వివాహితపై ఏడుగురు అత్యాచారం.. నలుగురు మైనర్స్.. ఎలా ట్రాప్ చేశారంటే..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-26 09:45:24  IST  )

మీటింగ్ అని పిలిచిన ఎక్స్‌ బాయ్ ఫ్రెండ్.. వివాహిత మహిళను దారుణంగా మోసం చేశాడు. మరో ఆరుగురితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఇందులో నలుగురు మైనర్లు ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన కేసు సంచలనం

వివాహితపై ఏడుగురు అత్యాచారం.. నలుగురు మైనర్స్.. ఎలా ట్రాప్ చేశారంటే..
X

దిశ, వెబ్ డెస్క్: మీటింగ్ అని పిలిచిన ఎక్స్‌ బాయ్ ఫ్రెండ్.. వివాహిత మహిళను దారుణంగా మోసం చేశాడు. మరో ఆరుగురితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఇందులో నలుగురు మైనర్లు ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన కేసు సంచలనం సృష్టిస్తుండగా.. పూర్తి వివరాలు చూద్దాం.

యూపీ సిద్ధార్థ్ నగర్‌లో వివాహిత మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. దళిత మహిళ అయిన ఆమెను మాజీ లవర్ వికాస్ ఓ సారి కలుద్దామని పిలిచాడు. దీంతో ఆమె అక్కడకు వెళ్లేసరికే మరో ఆరుగురు ఫ్రెండ్స్‌కు కాల్ చేశాడు. ఆమె వెళ్లాక తనపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ కాగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు వికాస్ పరారీలో ఉన్నాడు. కాగా వీరిలో నలుగురు మైనర్స్ అని నిర్ధారించారు పోలీసులు.

Next Story