పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య..
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధి రేణికుంట గ్రామానికి చెందిన ఓ వివాహిత గురువారం క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. రేణికుంటకు చెందిన బోయిని స్రవంతి(28)కి ఆమె భర్త అశోక్ తో జరిగిన చిన్న గొడవ కారణంగా గురువారం మధ్యాహ్నం క్షణికావేశంలో పురుగుల మందు తాగింది.

కుటుంబీకులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి అక్కి కొమురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శీలం ప్రమోద్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed