యువకున్ని పదునైన ఆయుధాలతో చంపిన మావోయిస్టులు.. కారణమిదే..!

by Disha Web Desk 4 |
యువకున్ని పదునైన ఆయుధాలతో చంపిన మావోయిస్టులు.. కారణమిదే..!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇన్ఫార్మర్ అన్న అనుమానంతో మావోయిస్టులు ఓ యువకున్ని హతమార్చారు. ఈ విషాదం బీజాపూర్ జిల్లా తరేం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తురేపార్ గ్రామానికి చెందిన ఆవలం హెడ్మా అనే యువకుడు తోటి గ్రామస్తులతో కలిసి కట్టెలు కొట్టుకురావటానికి సోమవారం మధ్యాహ్నం దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో మావోయిస్టులు అతన్ని తమతోపాటు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి పదునైన ఆయుధాలతో హెడ్మాను చంపారు. అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో వదిలేసి వెళ్లిపోయారు.


Next Story

Most Viewed