బీజాపూర్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-22 05:21:47  IST  )

భద్రతా బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా యాంపురం గ్రామంలో చోటుచేసుకుంది.

బీజాపూర్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య
X

దిశ, భద్రాచలం: భద్రతా బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా యాంపురం గ్రామంలో చోటుచేసుకుంది. మృతులలో ఒకరు దేవయ్య అలియాస్ సందీప్ మాజీ మావోయిస్టు. ఈ మధ్యనే పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసారు. అయితే మావోయిస్టుల కదలికలు పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడని అతనితో పాటు మరో గ్రామస్తుడిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. ఈ సంఘటన గిరిజన గ్రామాలలో భయాందోళన కలిగించింది.

Next Story