- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
by Disha Web Desk 11 |
X
దిశ, మద్దూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మద్దూరు మండల పరిధిలోని గుండుమాల్ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుండుమాల్ గ్రామానికి చెందిన లింగనోళ్ల బాలప్ప ఆదివారం కోస్గి సంతకు వెళ్లి ఆర్టీసీ బస్సులో వస్తున్న సమయంలో నిద్రలోకి జారుకోవడం వలన గుండుమాల్ లో దిగకుండా మద్దూరు పల్లె గట్టు గేటు వద్ద దిగాడు. గుండుమాల్ రోడ్డు వైపు నడుచుకుంటూ వస్తుండగా ద్విచక్ర వాహనం గుండుమాల్ నుంచి మద్దూర్ వస్తున్న క్రమంలో ఢీకొట్టింది.
దీంతో బాలప్ప తలకు తీవ్రగాయమైంది. స్థానికులు అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం బాలప్ప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story