మద్యం మత్తులో యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య

by Bhanu |

కరీంనగర్ జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్మన సంపత్ (30) మద్యం మత్తులో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన

మద్యం మత్తులో యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య
X

దిశ, కోటపల్లి: కరీంనగర్ జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్మన సంపత్ (30) మద్యం మత్తులో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి మద్యం సేవించిన అనంతరం మైకంలో ఆయన పురుగుల మందు సేవించినట్లు పోలీసులు తెలిపారు.

సంపత్‌ను గమనించిన కుటుంబ సభ్యులు తొలుత చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై రాజేందర్ తెలిపారు. మృతుడికి భార్య స్వప్న, సోదరుడు రాజేందర్ ఉన్నారు.

Next Story