పురుగుల మందు తాగి వ్యక్తి బలవన్మరణం

by Disha Web Desk 1 |
పురుగుల మందు తాగి వ్యక్తి బలవన్మరణం
X

దిశ, తూప్రాన్ : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మనోహరాబాద్ మండల పరిధిలోని కళ్ళకల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం పేరూర్ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి (52) కళ్ళకల్ కొత్త వైన్స్ సమీపంలో బ్రీజర్ లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మేడ్చల్ లోనే ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వెంకట్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్సై సందీప్ రెడ్డి వెల్లడించారు.



Next Story

Most Viewed