ప్రమాదవశాత్తు మల్లన్న సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
ప్రమాదవశాత్తు మల్లన్న సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి..
X

దిశ, కొండపాక : ప్రమాదవశాత్తు మల్లన్న సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం కుకునూర్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి ఎసై పుష్పరాజ్ కథనం మేరకు గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన పుసరాజు (26) తనకున్న 2 ఎకరాల వ్యవసాయ భూమిని తన భూమి పక్క నుండి వేలుతున్న మల్లన్న సాగర్ కాలువలో బోరు మెటర్ వేసి వ్యవసాయం చేసుకోని జీవనం కోనసాగిస్తూన్నడు.

రోజుమాదిరిగానే మంగళవారం సాయంత్రం వ్యవసాయ భూమి వద్ద కి వెళ్లి పోలానికి నీళ్లు పెడుదాం అని చూడగా కేనాలులోని మోటర్ క్రింద చేత్త తట్టుకోని మోటర్ పనిచేయ్యకపోతే అది సరిచెద్దాం అని కేనాలోకి దిగి సరిచేస్తుండగా పూసరాజు ప్రమాదవశాస్తు ఉపిరి అడాక నీళ్లలో మునిగిచనిపోయాడు. చనిపోయిన శావాన్ని గజ ఈత రాళ్ల సహాయంతో బుధవారం వేలికి తీశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దార్యాప్తు చేస్తున్నమని తెలిపారు.

Next Story

Most Viewed