లాడ్జిలో ప్రేమ జంట సూసైడ్..!

by Disha Web Desk 19 |
లాడ్జిలో ప్రేమ జంట సూసైడ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌లో అనుమానస్పద స్థితిలో ఓ యువతి, యువకుడు మృతి చెందారు. లక్డీకపూల్‌లోని ఓ లాడ్జిలో ఓ కడపకు చెందిన ఇద్దరు మృతి చెందారు. యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందగా.. మంచంపై యువతి విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన యువతి, యువకుడిని ప్రేమ జంటగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story

Most Viewed