అలోవెరా జ్యూస్ అనుకొని.. బాలిక ఏం తాగిందో చూడండి!

by Naveena |

అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మృతి చెందింది.

అలోవెరా జ్యూస్ అనుకొని.. బాలిక ఏం తాగిందో చూడండి!
X

దిశ, వెబ్‌డెస్క్ : అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. బెంగళూరుకు చెందిన దీపాంజలికి అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. అయితే ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న అలోవేరా బాటిల్ తీసుకొని తాగేసింది. అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో.. బాలిక తల్లిదండ్రులు ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు. అది దీపాంజలి గమనించకపోవడంతో పురుగుల మందు తాగేసింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లితండ్రులు బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం దీపాంజలికి చికిత్స పొందుతూ.. ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Next Story