ఒంటరి మహిళతో సహజీవనం..అంత‌లోనే అదిరిపోయే ట్విస్ట్

by velandi.Saikiran |   (  Updated:2026-06-10 22:00:17  IST  )

వివాహం చేసుకుంటానని మోసం చేసి.. నగదు, బంగారం తీసుకుని ఓ వ్య‌క్తి పారిపోయాడంటూ మేడిపల్లి పోలీస్ స్టేష‌న్ లో ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన సంఘ‌ట‌న బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది.

ఒంటరి మహిళతో సహజీవనం..అంత‌లోనే అదిరిపోయే ట్విస్ట్
X

దిశ, మేడిపల్లి : వివాహం చేసుకుంటానని మోసం చేసి.. నగదు, బంగారం తీసుకుని ఓ వ్య‌క్తి పారిపోయాడంటూ మేడిపల్లి పోలీస్ స్టేష‌న్ లో ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన సంఘ‌ట‌న బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, బోడుప్పల్ లోని ఉదయ్‌ నగర్‌ కు చెందిన సిస్టు వెంకట భారతి, భర్తకు దూరంగా ఉంటూ, ఒంటరి జీవితం గ‌డుపుతోంది. ఈ త‌రుణంలోనే 2019లో ఫేస్‌ బుక్ ద్వారా షేక్ మహబూబ్ హుస్సేన్‌ తో భార‌తికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స‌హ జీవనానికి దారి తీసింది. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, బోడుప్పల్‌లో ఆమెతో కలిసి జీవించాడు హుస్సేన్‌. ఈ క్ర‌మంలోనే తాజాగా రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకుని పారిపోయాడ‌ని భార‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఫిర్యాదును స్వీకరించిన మేడిపల్లి పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా హుస్సేన్ ప్ర‌స్తుతం మ‌రో అమ్మాయితో ఉంటున్నాడ‌ని స‌మాచారం.

Next Story