చికెన్​ పకోడిలో కారం ఎక్కువైందని అడిగితే కష్టమర్​ పై కత్తితో దాడి..

by Disha Web Desk 20 |
చికెన్​ పకోడిలో కారం ఎక్కువైందని అడిగితే కష్టమర్​ పై కత్తితో దాడి..
X

దిశ, కూకట్​పల్లి : చికెన్​ పకోడిలో కారం ఎక్కువైందని అడిగిన కస్టమర్​ పై కేపీహెచ్​బీ కాలనీలో చికెన్​ పకోడి నిర్వహకుడు కత్తితో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్​బీకాలనీ ఆరవ ఫేజ్​లో నివాసం ఉంటున్న ప్రణీత్​ రెడ్డి బుధవారం రాత్రి కేపీహెచ్​భీకాలనీ 9వ ఫేజ్ కూడలిలోని జేఎస్​ చికెన్​ పకోడి ఫుడ్​ ట్రక్​ వద్దకు వెళ్లి చికెన్​ పకోడి ఆర్డర్​ చేశాడు. చికెన్​ పకోడి తింటుండగా కారం ఎక్కువవడంతో కస్టమర్​ ప్రణీత్​ రెడ్డి చికెన్​ పకోడి నిర్వహకుడు జీవన్​ను కారం కొంచం తక్కువ వేయోచ్చు కదా అని అడిగాడు. దీంతో జీవన్​ కస్టమర్​తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కస్టమర్​ ప్రణీత్​ రెడ్డి మెడపై కత్తితో దాడి చేసేందుక ప్రయత్రించగా ప్రణీత్​ రెడ్డి తన ఎడమ చేయి అడ్డు పెట్టాడు.

దీంతో ప్రణీత్​ రెడ్డి ఎడమచేయి మోచేతి పై భాగంలో తెగి తీవ్ర గాయం ఏర్పడింది. వెంటనే ప్రణీత్​ రెడ్డితో పాటు ఉన్న వారు ప్రణీత్​ రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రణీత్​ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఎస్​ చికెన్​ పకోడి నిర్వహకుడు జీవన్​ పై పోలీసులు కేసునమోదు చేశారు. ఇదిలా ఉండగా చికెన్​ పకోడి నిర్వహకుడు స్థానిక కార్పొరేటర్​కు అత్యంత సన్నిహిత వ్యక్తి కావడంతో కేసు నీరుగార్చే అవకాశం ఉందని బాధితులు తెలిపారు. చికెన్​ పకోడి బండి వద్ద తరచు జీవన్​ అతడి మనుషులు కస్టమర్లతో, చుట్టు పక్కల వారితో దురుసుగా ప్రవర్తిస్తు గొడవలు పడుతుంటారని గాయపడిన ప్రణీత్​ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇదిలా ఉండగా బాధితుడు ప్రణీత్​ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని జీవన్​ పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్టు సీఐ కిషన్​ కుమార్​ తెలిపారు.

Next Story

Most Viewed