అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..

by Disha Web Desk 20 |
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, కామారెడ్డి రూరల్ : చేసిన అప్పులు తీర్చలేననే బాధతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దేవునిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై ప్రసాద్, బాధితుడి భార్య మౌనిక కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారికి చెందిన వడ్ల శ్రీకాంత్ తన భార్య పిల్లలతో కలిసి కొద్దిరోజుల నుంచి దేవునిపల్లిలో నివసిస్తున్నాడు. ఇతను ఓ మెడికల్ ఏజెన్సీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుండగా కొద్ది రోజుల క్రితం ఉద్యోగంలో నుంచి తొలగించారు.

దీనికి తోడు గతంలో యాక్సిస్ బ్యాంకులో నుంచి అప్పులు తీసుకున్నాడని, అంతేగాకుండా ఇతరుల వద్ద కూడా అప్పులు చేసినట్లు తెలిపారు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. గమనించిన భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఫ్యాన్ నుంచి కిందికి దించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

Next Story

Most Viewed