భర్త.. భార్య.. మధ్యలో ఓ ఫోన్ కాల్.. ప్రాణాలను తీసేసింది!

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మూడేళ్ల క్రితం హత్రాస్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమ్ వీర్(25). ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

భర్త.. భార్య.. మధ్యలో ఓ ఫోన్ కాల్.. ప్రాణాలను తీసేసింది!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మూడేళ్ల క్రితం హత్రాస్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమ్ వీర్(25). ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఓ రోజు భార్య వేరొకరితో ఫోన్ కాల్ మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఆమెను అనుమానించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త మాటలతో హర్ట్ అయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఇలా భార్య వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని ప్రేమ్ వీర్.. ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కొద్దిరోజులుగా అతను మానసికంగా కుంగిపోయాడని.. భార్య ప్రేమ దూరం కావడమే ఇందుకు కారణమని తెలిపారు కుటుంబ సభ్యులు.

Next Story