ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

by Disha Web Desk 20 |
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
X

దిశ, రామకృష్ణాపూర్ : ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఆర్ఆర్ కాలనీ రోడ్డు నం.2 కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గూడెపు కామేశ్వరరావు దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె శ్రీ వైష్ణవి (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.

కాగా శ్రీ వైష్ణవి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత పొందుతాన లేదా అనే అనుమానంతో మానసికంగా బాధపడుతూ ఉండే దాని, గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి అనంతరం శ్రీ వైష్ణవి తనరూమ్ లోకి చదువుకుంటానని వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. తండ్రి కామేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed