- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదాపూర్లో రూ.300 కోట్ల స్థలం కాపాడిన హైడ్రా
మాదాపూర్ పరిధిలోని కాకతీయ హిల్స్లో సుమారు రూ.300 కోట్ల విలువైన 4,090 చదరపు గజాల పార్కు స్థలంతో పాటు ఇతర కామన్ ల్యాండ్ను హైడ్రా కాపాడింది.

దిశ, డైనమిక్ బ్యూరో : నగరంలో అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురవుతున్న పార్కులు, ఓపెన్ ప్లేస్లు, కామన్ ల్యాండ్ను రక్షించేందుకు హైడ్రా (HYDRA) ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో తాజాగా మాదాపూర్ పరిధిలోని కాకతీయ హిల్స్లో సుమారు రూ.300 కోట్ల విలువైన 4,090 చదరపు గజాల పార్కు స్థలంతో పాటు ఇతర కామన్ ల్యాండ్ను హైడ్రా కాపాడింది. నకిలీ పత్రాలతో ఈ భూములను కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నించడంతో, స్థానిక అసోసియేషన్ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి, అక్రమ కబ్జాలపై చర్యలు చేపట్టారు. కబ్జాకు గురయ్యే ప్రమాదంలో ఉన్న స్థలాలకు కంచె ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. 1979 నాటి లేఅవుట్ నిబంధనల ప్రకారం ఈ బహిరంగ ప్రదేశాలు ప్రజావసరాల కోసం కేటాయించినవని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యలతో స్థానికులు హైడ్రా అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగించాలని కోరుతున్నారు.






