హైదరాబాద్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాల గుట్టురట్టు

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాల గుట్టురట్టయ్యింది. నగరంలో ఈనెల 22 నుండ 28 వరకు సైబరాబాద్ పోలీసులు 10 కేసులను చేధించి 20 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో 14 మంది ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు.

హైదరాబాద్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాల గుట్టురట్టు
X

దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాల గుట్టురట్టయ్యింది. నగరంలో ఈనెల 22 నుండ 28 వరకు సైబరాబాద్ పోలీసులు 10 కేసులను చేధించి 20 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో 14 మంది ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఐదుగురు నిందితులు రూ.3 కోట్ల ఆన్లైన్ టికెట్ బుకింగ్ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మోసగాళ్లు ప్రజల నుండి డబ్బులు దోచుకునేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. మ్యాట్రిమొనీ, ఆన్ లైన్ బిజినెస్, జాబ్ ఆఫర్స్ ఇలా ఏదో ఒక రకంగా అమాయకులకు వల విసురుతున్నారు. నమ్మినవాళ్లును అందినంత దోచేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సైబర్ నేరాలపై సైబరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదు అందినవెంటనే పరిష్కరిస్తున్నారు.

Next Story