బండి మీద నుంచి తోసేసి.. భార్యను చంపిన భర్త

by velandi.Saikiran |   (  Updated:2026-03-31 00:23:02  IST  )

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కు చెందిన ఓ వ్య‌క్తి బండి మీద నుంచి తోసేసి భార్యను చంపాడు.

బండి మీద నుంచి తోసేసి.. భార్యను చంపిన భర్త
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో రోజుకో దారుణం జరుగుతూనే ఉంది. మహిళలను టార్గెట్ చేసి, వేటాడి చంపేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అవసరం తీరాక భార్యలను కూడా హత మార్చుతున్నారు. మొన్నటికి మొన్న కోరుట్ల, లేటెస్ట్ గా ఏపీలో ఇలాంటి సంఘటనలు తెరపైకి వచ్చాయి. అయితే అచ్చం ఇలాగే మరొకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బండి మీద నుంచి తన భార్యను కిందకు తోసేసి చంపేశాడు భర్త. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

బండి మీద నుంచి తోసేసి.. భార్యని చంపిన భర్త

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కు చెందిన ఓ వ్య‌క్తి బండి మీద నుంచి తోసేసి భార్యను చంపాడు. త‌న భార్యను బైక్‌పై ఎక్కించుకొని వెళ్తూ తన భార్యను ఉద్దేశపూర్వకంగా కిందపడేశాడు భర్త. ఈ క్ర‌మంలోనే ఒక్కసారిగా కింద పడటంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే చనిపోయింది. ఒక బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తూ గొడవ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కోపంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు స‌ద‌రు వ్యక్తి. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కట్నం కోసం వేధిస్తున్నాడని మృతురాలి ఫ్యామిలీ ఆరోపణలు చేస్తోంది. క్లిక్

Next Story