దారుణం.. బాత్ రూమ్‌లో ఆ స్థితిలో భార్యాభర్తలు.. పని మనిషి చూసి షాక్!

by Disha Web Desk 7 |
దారుణం.. బాత్ రూమ్‌లో ఆ స్థితిలో భార్యాభర్తలు.. పని మనిషి చూసి షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో దారుణం జరిగింది. హోళీ పండుగ సరదాగా జరుపుకున్న దంపతులు అంతలోనే విగత జీవులుగా మారారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఘాట్‌కోపర్ ఏరియాలోని కుక్రేజా బిల్డింగ్‌లో భర్త (42), భార్య (39) నివాసం ఉంటున్నారు. అయితే హోళీ పండుగా రోజు పార్టీ జరుపుకుని ఇంటికి వచ్చారు దంపతులు. కాగా.. ఉదయం వారి ఇంట్లో పని చేసే మహిళ వచ్చి డోర్ కట్టినా తీయకపోవడంతో ఆ బిల్డింగ్ సెకండ్ కీ‌తో తలుపు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లింది. ఇంట్లోని బాత్‌రూమ్‌లో భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి షాక్ అయింది. వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకున్న పంత్ నగర్ పోలీసులు యాక్సిడెంట్ డెత్‌గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. భార్యాభర్తల మరణానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు.

Next Story

Most Viewed