- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం.. బాంబుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు
జైపూర్–అజ్మీర్ నేషనల్ హైవేపై దుడు ప్రాంతం వద్ద గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ట్రక్కును మరో లారీ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో ఘోర ప్రమాదం (Fatal accident) జరిగింది. జైపూర్–అజ్మీర్ నేషనల్ హైవేపై దుడు ప్రాంతం వద్ద గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ట్రక్కు (Gas cylinders truck)ను మరో లారీ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీ కొన్న వెంటనే ట్రక్కులో ఉన్న సిలిండర్లు బాంబుల్లా పేలిపోగా, మంటలు చెలరేగి రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters) మంటలను ఆర్పేందుకు భారీగా ప్రయత్నాలు జరిపారు. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు పలువురు వ్యక్తులు గాయపడగా, వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. అలాగే గ్యాస్ సిలిండర్లు (Gas cylinders) పేలుడు ధాటికి ఎగిరి పడుతుండటంతో అనేక వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా, ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ సిలిండర్ల లీకేజీ కారణంగా మంటలు మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వీలైనంత ట్రాఫిక్ క్లియర్ చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.






