హైదరాబాద్‌లో రూ.3.5 కోట్ల నగదు సీజ్

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లో రూ.3.5 కోట్ల నగదు సీజ్
X

దిశ, ముషీరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ మారియట్ సమీపంలో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం తనిఖీలు నిర్వహించారు. రెండు షిఫ్టు డిజైర్ కార్లలో తనిఖీలు సోదాలు జరుపగా.. రూ.3.5 కోట్ల నగదు లభ్యమైంది. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పొలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్దనున్న రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని గాంధీ నగర్‌ పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed