BUS Accident: లోయలో పడ్డ బస్సు.. నలుగురు దుర్మరణం

by Gantepaka Srikanth |

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని పౌరీలో ఘోర రోడ్డు ప్రమాదం(Bus Accident) జరిగింది.

BUS Accident: లోయలో పడ్డ బస్సు.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని పౌరీలో ఘోర రోడ్డు ప్రమాదం(Bus Accident) జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం(Four Passengers Dead) చెందగా.. మరో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story