మహిళను కారుతో గుద్ధి చంపిన మాజీ మంత్రి అనుచరుడు..

by Disha Web Desk 20 |
మహిళను కారుతో గుద్ధి చంపిన మాజీ మంత్రి అనుచరుడు..
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపురం మాజీ జెడ్పీటీసీ మద్యం మత్తులో కారు నడుపుతూ మహిళను గుద్ది చంపిన సంఘటన కొల్లాపూర్ మండల పరిధిలోని కల్వకుల్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కల్వకుల్ గ్రామంలో గురువారం రాత్రి 8:30 కు శేషమ్మ అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో కొల్లాపురం మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్ మధ్యం సేవించి అతివేగంగా వాహనం నడుపుకుంటూ వచ్చి శేషమ్మను కారుతో ఢీకొన్నాడు.

ఈ ప్రమాదంలో శేషమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. జెడ్పీటీసీ హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వస్తుండగా కల్వకుల గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాగా మృతురాలు శేషమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. ఇదే ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సురేష్ గౌడ్ అక్కడే ఉండడంతో రెండు కాళ్లు విరిగాయని బాధితులు చెప్తున్నారు. చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీనగర్ పవన్ సాయి హాస్పిటల్ కు తరలించినట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే హనుమంతు నాయక్ వనపర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని సమాచారం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాదిత కుటుంబ సభ్యులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.



Next Story

Most Viewed