- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి ఐదుగురు మృతి
by Malleboina Mahesh |
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని టెహ్రీ జిల్లాలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని టెహ్రీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేంద్ర నగర్ ప్రాంతంలోని కుంజాపురి–హిందోళాఖల్ మార్గంలో సుమారు 28 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు SDRF అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారంతో వెంటనే రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






