బిగ్ బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

by Dishanational4 |
బిగ్ బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో గిరిధర్ (45), ప్రియ (15), మహేష్ (2), జగదీష్ (35), అనిత (30) ఉన్నారు. ఇంకా ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బిహార్‌ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖారారు.!


Next Story

Most Viewed