టెర్రేస్‌పై పడుకున్నందుకు.. కూతురిని 25 సార్లు పొడిచి చంపిన తండ్రి

by Disha Web Desk 12 |
టెర్రేస్‌పై పడుకున్నందుకు.. కూతురిని 25 సార్లు పొడిచి చంపిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి తన కుమార్తెను కత్తితో దాదాపు 25 సార్లు పొడిచి చంపేశాడు. ఈ ఘోర సంఘటన మే 18 న సూరత్‌లోని కడోదర ప్రాంతంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వేలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన కూతురిని దారుణంగా కత్తతో పోడిచి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం.. రామానుజ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సూరత్‌లోని సత్య నగర్ సోసైటీలో అద్దకు ఉంటున్నాడు.

అయితే మే 18 రాత్రి ఇంట్లో గొడవ జరిగడంతో ఆడావాళ్లంత టెర్రేస్‌పై పడుకున్నారు. దీంతో అతను తన భార్యతో వాగ్వాదానికి దిగి తీవ్ర కోపోద్రిక్తుడై.. తన కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. అక్కడే ఉన్నవాళ్లు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వారిపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన దృష్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో క్లీయర్‌గా రికార్డయ్యాయి. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed