చెరువులో దూకి తండ్రీ, కొడుకు ఆత్మహత్య

by Disha Web Desk 1 |
చెరువులో దూకి తండ్రీ, కొడుకు ఆత్మహత్య
X

దిశ, హనుమకొండ టౌన్ : చెరువులో దూకి తండ్రీ, కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండ పట్టణంలోని కనకదుర్గ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. విరాల్లోకి వెళితే.. కనకదుర్గ కాలనీకి చెందిన శిలమంతుల రవీందర్ అతడి కుమారుడు శ్రీచరణ్ వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సుబేదారి పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story