ఘోర రోడ్డు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం

by Disha Web Desk 2 |
ఘోర రోడ్డు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కన్యాకుమారిలో ఓ కారు బస్సును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. మైలాడుదురై అనే ప్రాంతంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి బైకులు, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed