- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జైపూర్-అజ్మీర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా 11 మంది మృతి
by Disha Web Desk 12 |
X
రాజస్థాన్: జైపూర్-అజ్మీర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారుపై ట్యాంకర్ ట్రక్కు బోల్తా పడటంతో ఎనిమిది మంది మరణించారు. ఇందులో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ట్యాంకర్ ట్రక్కు టైరు పగిలి పక్కనే వెళ్తున్న కారుపై బోల్తా పడిందని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మృతి చెందిన వారిలో ఆరుగురిని హసీనా, సోను, ఇస్రాయిల్, రోహినా, మురాద్, షకీల్గా గుర్తించామని, మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్టు ప్రసాద్ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు అజ్మీర్కు తీర్థయాత్రకు వెళుతుండగా జైపూర్-అజ్మీర్ హైవేపై రామ్నగర్ ప్రాంతానికి సమీపంలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
Next Story