Breaking News .. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లో ఘోర ప్రమాదం..

by Disha Web Desk 12 |
Breaking News .. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లో ఘోర ప్రమాదం..
X

దిశ, డైనమిక్ బ్యూరో : కొత్త సంవత్సరం ప్రారంభంలోనే నగరంలో విషాదన ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్​3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న మారుతి కారు..రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద అదుపు తప్పి డివైడర్​ను ఢీ కొట్టింది. దీంతో, కారు కంట్రోల్ తప్పి తప్పుడు దోవలో వెళ్లగా...రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. ఆపై అక్కడ నిలిపి ఉన్న మరో రెండు కార్లను వెనుక నుంచి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారులో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పాదాచారులు (ఒక మహిళ) మృతి చెందారు. మృతులను భీమవరంకు చెందిన ఈశ్వరి, రావుల పాలెంకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు.

ఇంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఈశ్వరి ఇళ్లలో చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతుంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కార్ నడిపిన ఇద్దరు మణిపాల్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా పోలీస్‌లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా న్యూఇయర్ వేడుకల సందర్భంగా నిందితులు మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

Next Story

Most Viewed