దువ్వాడ డబుల్ మర్డర్ కేసు.. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా అరెస్ట్

by Kema Shiva Kumar |

విశాఖ (Vishakha)లో డబుల్ మర్డర్ కేసు (Double Murder Case) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దువ్వాడ డబుల్ మర్డర్ కేసు.. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ (Vishakha)లో డబుల్ మర్డర్ కేసు (Double Murder Case) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ జంట హత్యలకు సంబంధించి దువ్వాడ (Duvvada) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. ఈ మేరకు అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు కేసును రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఈ మేరకు గంపాల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)లను హత్య చేసింది వారికి అత్యంత నమ్మకంగా ఉన్న ప్రసన్న కుమార్ మిశ్రానే (Prasanna Kumar Mishra) అని తేలింది. ఈ మేరకు ఇవాళ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story