ఫుల్లుగా తాగి రైలు పట్టాల మీద పడుకున్న యువకుడు.. చివరకు ఏమైందంటే?

by Dishafeatures2 |
ఫుల్లుగా తాగి రైలు పట్టాల మీద పడుకున్న యువకుడు.. చివరకు ఏమైందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఫుల్లుగా మద్యం సేవించిన ఓ యువకుడు రైలు పట్టాలపై పడిపోయాడు. మద్యం మత్తులో అక్కడే నిద్రపోయాడు. అయితే అప్పుడు అటుగా ట్రైన్ వచ్చింది. ఇంతకు చివరికి ఏం జరిగిందంటే.. కేరళలోని అచన్ కోవిళ్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల రెజీ ఫుల్లుగా మద్యం సేవించి ఎజుకోన్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై పడిపోయాడు. మద్యం మత్తులో ఎటూ కదలలేక అక్కడే నిద్రపోయాడు.

అయితే అప్పుటే అటుగా కొల్లాం - పునలూర్ మేమూ ట్రైన్ స్లోగా వస్తోంది. అయితే వ్యక్తి పట్టాలపై పడిపోయాడు అని కనిపెట్టిన లోకోపైలట్ ట్రైన్ ను చాకచక్యంగా ఆపాడు. దీంతో ఆ యువకుడు చావు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం ఆ యువకుడిని అక్కడి నుంచి లేపి రైల్వే పోలీసులకు అప్పజెప్పారు. కాగా ఈ ఘటన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది.



Next Story

Most Viewed