సంచలనం: ఉప్పల్‌లో డబుల్ మర్డర్

by Disha Web Desk 2 |
సంచలనం: ఉప్పల్‌లో డబుల్ మర్డర్
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఉప్పల్ ప్రాంతంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి, కొడుకును హత్య చేసి స్థానికంగా కలకలం రేపారు. తండ్రిపై దాడి చేస్తున్న వారిని కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కుమారుడిపై కూడా కిరాతంగా దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి, కొడుకులు ఇద్దరూ మరణించారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతులు నర్సింహశర్మ, శ్రీనివాస్‌గా గుర్తించారు. కాగా, కుమారుడు శ్రీనివాస్ నెల క్రితమే మలేషియా నుంచి వచ్చినట్లు సమాచారం.



Next Story

Most Viewed