20వ అంతస్తు పైనుంచి దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

by Disha Web Desk 2 |
20వ అంతస్తు పైనుంచి దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, మియాపూర్: 20వ అంతస్తు పైనుంచి కిందికి దూకి డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్ఐ యాదగిరి రావు తెలిపిన వివరాల ప్రకారం.. కోమలిక (21) అనే యువతి మియాపూర్‌లోని మాతృశ్రీ నగర్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నది. మంగళవారం సాయంత్రం కోమలిక కాలేజీ నుంచి ఎస్ఎంఆర్ ఫౌంటెన్ హెడ్‌లో నివాసం ఉంటున్న తాతయ్య, నానమ్మ వాళ్ల ఇంటికి వచ్చింది. అనంతరం బిల్డింగ్ చివరి అంతస్తు టెర్రస్‌పై నుంచి దూకింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed