ఉదాసీన్ మ‌ఠ్ ఖాళీ స్థ‌లంలో కుళ్లిన స్థితిలో వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం

by Ratna Kumari |   (  Updated:2026-05-17 14:30:41  IST  )

కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఉదాసీన్​ మఠ్​కు సంబంధించిన ఖాళీ మైదానంలో ఆదివారం కుళ్లిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.

ఉదాసీన్ మ‌ఠ్ ఖాళీ స్థ‌లంలో కుళ్లిన స్థితిలో వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఉదాసీన్​ మఠ్​కు సంబంధించిన ఖాళీ మైదానంలో ఆదివారం కుళ్లిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఉదాసీన్​ మఠ్​కు చెందిన సెక్యూరిటి ఇన్​చార్జి సూరజ్​ మిశ్ర ఆదివారం కూకట్​పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఖాళీ మైదానంలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు తెలిపాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ చెట్టు కొమ్మకు నల్లని బెల్టుకు కుళ్లిన స్థితిలో మృతదేహం భాగం వేలాడు కనిపించింది. పక్కనే ఉన్న ప్యాంట్​ జేబులో ఉన్న మొబైల్​ ఫోన్​ ద్వార సదరు వ్యక్తి పేరు వల్లూరి బాలకిషన్​గా గుర్తించారు. బాలకిషన్​ మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ ఫరిధిలోని గోకుల్​ ప్లాట్స్​లో నివాసం ఉంటు మెడిప్లస్​లో ఉద్యోగం చేస్తుండే వాడు. మార్చి నెలలో బాలకిషన్​ భార్య మృతి చెందడంతో బాలకిషన్​పై వేధింపుల కేసు నమోదు కాగా విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన బాలకిషన్​ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story