గొడ్సెర వాగులో మృతదేహం లభ్యం..

by Disha Web Desk 20 |
గొడ్సెర వాగులో మృతదేహం లభ్యం..
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం గొడ్సెర గ్రామం వాగులో శనివారం సాయంత్రం ఓ మృతదేహం లభ్యం అయింది. ఇది తెలుసుకున్న స్థానికులు వెంటనే మృతదేహాన్ని చూడడానికి బారులు తీరారు. మృతదేహాన్ని చూసిన స్థానిక ప్రజలు గ్రామానికి చెందిన మనేవార్ బలరాం కుమారుడు మనేవార్ దత్తహరి (28)గా గుర్తించారు.

స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం చనిపోయిన దత్తహరి వృత్తిరీత్య వ్యవసాయం చేస్తున్నాడు. శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తన శనిగపొలంలో భార్య, కుటుంబీకులతో పనిచేస్తూ మద్యాహ్నం పశువులకి నీళ్లుతాపే క్రమంలో వాగుకి వెళ్ళగా మళ్ళీ సాయంత్రం వాగులో విగత జీవిగాపడి ఉండడంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Next Story