ట్రాక్టర్ ను ఢీకొట్టిన డీసీఎం.. వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

ట్రాక్ట‌ర్ ను డీసీఎం ఢీ కొట్ట‌డంతో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఎర్ర‌వ‌ల్లి మండ‌లం వేముల స్టేజీ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై సోమ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.

ట్రాక్టర్ ను  ఢీకొట్టిన డీసీఎం.. వ్య‌క్తి మృతి
X

దిశ, ఎర్రవల్లి : ట్రాక్ట‌ర్ ను డీసీఎం ఢీ కొట్ట‌డంతో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఎర్ర‌వ‌ల్లి మండ‌లం వేముల స్టేజీ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై సోమ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌ర్నూలు జిల్లా పంచ‌లింగాల గ్రామానికి చెందిన 20 మంది భ‌క్తులు సింగోటం జాత‌ర‌కు వెళ్లారు. జాత‌ర ముగించుకొని తిరుగు ప్ర‌యాణంలో వెళ్తుండ‌గా.. ఎర్ర‌వ‌ల్లి మండ‌లం వేముల స్టేజీ వ‌ద్ద వెనుక నుంచి ట్రాక్ట‌ర్ ను డీసీఎం ఢీ కొట్ట‌డం వ‌ల్ల ఖాజాగౌడ్ అనే వ్య‌క్తి మృతి చెందాడు. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను క‌ర్నూల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story