విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

by Disha Web Desk 1 |
విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
X

ప్రభుత్వమే ఆదుకోవాలంటూ.. బాధితుడి వేడుకోలు

దిశ, దుబ్బాక : విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైతు చుక్క నరేష్ రోజు లాగానే తన గేదెను రాత్రి సమయంలో తన వ్యవసాయ పోలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. మరునాడు ఉదయం పోలం వద్దకు వెళ్లేసరికి బోరు మోటారు వద్ద విద్యుత్ తీగ గేదెకు తగిలి ఉండడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.

దీంతో రూ.65 వేల విలువ గల గేదె చనిపోయిందంటూ రైతు చుక్క నరష్ రోదించాడు. తనది నిరుపేద కుటుంబమని.. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని నరేష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మట్టా మల్లారెడ్డి మాట్లాడుతూ.. నరేష్ ది నిరుపేద కుటంబమని తనుకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed