డాక్టర్‌కు కుచ్చుటోపి పెట్టిన సైబర్ నేరగాళ్లు.. ఒక్క మెసేజ్ పంపి..

by Disha Web Desk 19 |
డాక్టర్‌కు కుచ్చుటోపి పెట్టిన సైబర్ నేరగాళ్లు.. ఒక్క మెసేజ్ పంపి..
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ డాక్టర్‌నే బురిడికొట్టించారు. ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ పేరుతో డాక్టర్‌కు మెస్సేజ్‌లు పంపించిన కేటుగాళ్లు.. వారి వద్ద నుండి రూ. 1.92 లక్షలు కొట్టేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.



Next Story

Most Viewed