భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. స్పందించిన కమ్యూనిస్ట్ పార్టీ

by Gantepaka Srikanth |
భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. స్పందించిన కమ్యూనిస్ట్ పార్టీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య తక్షణమే అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ప్రకటన సానుకూలంగా ఉందని సీపీఐ(ఎం) తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు దేశాల ప్రజలు శాంతి కోసం చేసిన కృషిని అభినందిస్తున్నామన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన సరిహద్దులలో ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేయాలని సూచించారు. ఇక నుండి ఎటువంటి ఘర్షణలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నదన్నారు.



Next Story

Most Viewed