సంక్రాంతి ముంగిట విషాదం.. అన్నదమ్ముల ఘర్షణలో ఒకరు మృతి

by Naga Rani Yarlagadda |

రెండ్రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుండగా.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది.

సంక్రాంతి ముంగిట విషాదం.. అన్నదమ్ముల ఘర్షణలో ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుండగా.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యంతాగి వేధిస్తున్నాడని అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ పెద్దది కావడంతో కుటుంబ సభ్యులు పచ్చడి బండతో దాడి చేశారు. దీంతో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story