నిజామాబాద్ పట్టణంలో చైన్ స్నాచింగ్

by Disha Web Desk 1 |
నిజామాబాద్ పట్టణంలో చైన్ స్నాచింగ్
X

దిశ, నిజామాబాద్ క్రైం : నగరంలోని ఆర్యనగర్ గూడెంకి చెందిన మేకల శ్రావణి అనే మహిళ నుంచి శుక్రవారం మధ్యాహ్నం బంగారు గొలసు, చేతిలో సెల్ ఫోన్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు 4వ టౌన్ ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ లాగే హౌజింగ్ బోర్డు కాలనీలో ట్యూషన్ చెప్పి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో అమరవీరుల పార్కు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివాపై వచ్చి ఆమె చేతిలోని మొబైల్ ఫోన్, మెడలోని అర తులం బంగారు గొలుసు లాక్కుని వెళ్లారని తెలిపారు. శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed